ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో 2026-27 విద్యాసంవత్సరానికి గాను MBA, MCA కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఐసెట్-2026 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శనివారం ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు.
-
మొత్తం దరఖాస్తులు: 26,219 మంది
-
హాజరైన వారు: 23,198 మంది
-
అర్హత సాధించిన వారు: 21,205 మంది
-
మొత్తం ఉత్తీర్ణత శాతం: 91.41% (ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఉత్తీర్ణత నమోదైంది).
ఈ ఫలితాలలో కూడా విద్యార్థినులే తమ ఆధిక్యాన్ని చాటుకున్నారు.
-
బాలుర ఉత్తీర్ణత: 10,432 మంది పరీక్ష రాయగా, 9,380 మంది (89.91%) అర్హత సాధించారు.
-
బాలికల ఉత్తీర్ణత: 12,766 మంది పరీక్ష రాయగా, 11,825 మంది (92.62%) ఉత్తీర్ణత సాధించి సత్తా చాటారు.
ఈ ఏడాది ఫలితాల్లో కోస్తాంధ్ర, రాయలసీమ విద్యార్థులు టాప్-10లో నిలిచి మెరిశారు. కాకినాడకు చెందిన వైష్ణవి అనే విద్యార్థిని 166.094 మార్కులతో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు కైవసం చేసుకుంది.
-
1వ ర్యాంక్: వైష్ణవి (కాకినాడ)
-
2వ ర్యాంక్: బి. వెంకట సిద్ధార్థ యాదవ్ (వైఎస్ఆర్ కడప)
-
3వ ర్యాంక్: షేక్ ఖాజాలియాఖత్ (నెల్లూరు)
పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఉన్నత విద్యామండలి (APSCHE) అధికారిక వెబ్సైట్ ద్వారా తమ ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు
-
మొదట అధికారిక వెబ్సైట్ cets.apsche.ap.gov.in ను సందర్శించండి.
-
మీ రిజిస్ట్రేషన్ నంబర్, ఐసెట్ హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయండి.
-
వివరాలు సమర్పించిన (Submit) తర్వాత మీ ర్యాంక్ కార్డు స్క్రీన్పై కనిపిస్తుంది. రాబోయే కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం దానిని ప్రింట్ తీసి భద్రపరుచుకోండి.
-
వాట్సాప్ ద్వారా కూడా…విద్యార్థుల సౌకర్యార్థం ఈసారి వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు పొందే అవకాశం కల్పించారు. 9552300009 అనే ‘మన మిత్ర’ నంబర్కు వాట్సాప్లో “Hi” అని మెేసేజ్ పంపి, “ఎడ్యుకేషన్ సర్వీసెస్” ఆప్షన్ ద్వారా మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి క్షణాల్లో ర్యాంక్ కార్డును పొందవచ్చు.
ఫలితాలు విడుదలైన నేపథ్యంలో, త్వరలోనే ఏపీ ఐసెట్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను అధికారులు ప్రకటించనున్నారు.




