హైదరాబాద్లో జర్నలిస్టులు చేపట్టిన ‘చలో హైదరాబాద్’ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జర్నలిస్టుల సంక్షేమ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (TWJF) పిలుపునిచ్చిన ఈ ఆందోళన తీవ్ర రూపం దాల్చింది.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి పెద్ద ఎత్తున జర్నలిస్టులు ఈ నిరసనలో పాల్గొనేందుకు హైదరాబాద్ చేరుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న జర్నలిస్టులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. ధర్నాకు దిగిన జర్నలిస్టులను, సంఘాల నాయకులను పోలీసులు బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి అరెస్టు చేశారు. అరెస్టు చేసిన జర్నలిస్టులను పోలీసులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్తో పాటు నగరంలోని పలు ఇతర స్టేషన్లకు తరలించారు.
ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా జర్నలిస్టులు తమ డిమాండ్లను నెరవేర్చాలని నినాదాలు చేశారు. జాస్వామ్యంలో నాల్గవ స్తంభమైన మీడియా ప్రతినిధులపై పోలీసుల ఆంక్షలు, అరెస్టుల పట్ల జర్నలిస్ట్ సంఘాలు తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.



